ఏకాగ్రతా రహస్యం

ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు. కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. ఎవరు ఏ పని చేస్తున్న ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది, అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివ్రుత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం. కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు. దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది.

           
భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నకు సైతం భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పిన సమాధానం :
అర్జునుడు : కృష్ణా! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ! దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బందించడం లాంటిదే! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడం ఎలా?
శ్రీకృష్ణుడు : అర్జునా! నువ్వు చెబుతున్నది నిజమే. మనస్సు చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంతా సులభమైన పని కాదన్నది నిజమే! అయితే అంతటి చంచలమైన మనసును సైతం నిరంతర సాధన ,అంటీ ముట్టని ధోరణి అనే బలం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చన్నది అంతే నిజం.
మనస్సును నియంత్రణలోకి తీసుకురావడానికి అన్నిటికన్నా ముఖ్యంగా, మొట్టమొదట ఓ విషయం తెలుసుకోవాలి. తాము పోరాడదలచిన మనస్సు స్వభావాన్ని స్పష్టంగా అర్ధం చేసికోవాలి. మనస్సనేది కోతి లాగ చంచలమైనది. తప్పతాగి మత్తెక్కిన ఏనుగు లాగ చాల బలమైనది. అలాంటి మనసును నియంత్రించడమనేది అర్జునుడు చెప్పినట్లుగా, గాలిని పట్టుకోవడం లాంటిదే! కోతులను పట్టుకోవడంలోను, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం లోను ఎలాంటి నైపుణ్యం అవసరమో  అంతా నేర్పు మనస్సును క్రమబద్దీకరించడానికి కావాలి.
         
 భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరునకు వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం  ఇదీ మనస్సు స్వభావం. ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.
          
 కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం  ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో దమం అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే శమం అంటారు.
    మనస్సు గురించి, దాని ఏకాగ్రత గురించి ఎన్నో వివరాలు తెలిసిన తరువాత, ‘అసలింతకీ, మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి?’ అని కొందరు అడుగవచ్చు. దీనికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. దానికి సరైన జవాబు ఒక్కటే: మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనస్సుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది.
           కొందరు కొన్ని సందర్భాలలో, మరికొందరు తమ జీవిత పర్యంతము దుర్భల మనష్కులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారి మానసిక శక్తులన్నీ విచక్షణారహితంగా వేర్వేరు అంశాలపైన చెల్లచెదురై పోవడం వలన వారు అలా దుర్భల మనష్కులుగా కనిపిస్తుంటారు. అగ్నిని సృష్టించే శక్తి సూర్యకిరణాలకు ఉందని అందరికీ తెలియదు. వాళ్ళకు ఎందుకు తెలియదంటారా? సూర్యకిరణాలు నిప్పును పుట్టిస్తూ, వస్తువులను కాల్చి వేస్తుండడం వారు చూసి ఉండకపోవచ్చు! కానీ అవే సూర్యకిరణాలను ఓ కుంభాకార దర్పణం గుండా పోనిచ్చి, ఓ కాగితం ముక్క మీద పడేలా చేస్తే ,వారే ఆ కాగితాన్ని కాల్చవచ్చు. మరి , ఆ కిరాణాలకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? ఆ కిరాణాలను ఏక బిందుముఖంగా సాగేల చేసి, ఆ రకంగా వాటిని ఎకాగ్రపరచడం వలన కలిగిన ఫలితమే ఆ కాగితం కాలడం! అంతకు ముందు, ఆ కిరణాలు వివిధ దిశల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. దాంతో, ఉష్ణాన్ని పుట్టించే శక్తి వాటికి ఉన్నప్పటికీ, అవి వేటిని కాల్చలేకపోయాయి. కానీ, వాటిని ఎకాగ్రపరచిన వెంటనే ప్రకాశవంతమైన నిప్పును పుట్టించాయి. ఈ రహస్యం మనం గ్రహించాలి.
    ఇదే రకంగా, మన మనస్సుల్లో సహజసిద్దంగానే అసాధారణమైన శక్తి ఉంటుంది. అయితే, అవసరమైన, అవసరం లేని అన్ని రకాలైన అంశాల మీద ఈ శక్తిని మనం ఖర్చు చేస్తున్నాం. అందువల్లే మనం అత్యంత సాధారణమైన పనులు తప్ప మిగిలినవేవి చేయలేకపోతున్నాం. ఘనకార్యాలు సాధించాలంటే, చెల్లా చెదురుగా ఉన్న మానసిక శక్తులన్నిటిని క్రమబద్దీకరించాలి. మన మనస్సులు స్వాధీనంలో ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం.
       ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది.


1.         ధ్యానం చేస్తునపుడు కూర్చోడానికి యోగికి దృడమైన ,మెత్తటి ఆసనం కావాలి. అలాగే, ప్రతి విద్యార్థీ పుస్తకాలు పరుచుకుని హాయిగా చదువుకోడానికి ఓ బల్ల, ఓ కుర్చీ కావాలి. విధ్యర్థీ కూడా అనేక అంశాలలో యోగి లాంటి వాడె!  ఇక్కడ ముక్యం బల్ల,కుర్చీ కాదు చదువుకోడానికి కూర్చునే వాలు ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా కూర్చోవాలని దిని అర్థం.
2.     రాయడానికి చదవడానికి కూర్చునే వాలు వల శరీరాన్ని అనవసరంగా కదిలించకూడదు. చాలామంది విద్యార్థులు చదుకోడానికి వివిధ బంగిమాలలో కూర్చుంటారు. కొందరైతే ఎదో ఆలోచిస్తూ దిర్గమైన ఆలోచనలలో మునిగిపోతారు అసలు రెప్పలు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. ఎంకొందరితే పెన్నులు, పెన్సిల్ వివిదవి నోటిలో పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఇంకా చాల ఉన్నాయి ఇలా చేయడంవల్ల మనం ఏకాగ్రతకు భంగం కల్గుతుంది. కదులుతున్న పాత్ర తన్నలోని నీటిని ఎలా చలింపచేస్తుందో అలాగే మనం కూర్చునే భాగిమలు మరినపుదల మన మనసు చలిస్తూ ఉంటుంది కనుక చాడువుకున్తపుడు హుందాగా కూడిన స్త్రిరమైన భంగిమలో కూర్చుంటే మంచిది.
3.   మనం ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని నిర్ణిత సమయం లో దానిని పూర్తి చేయాలనీ అనుకుంటాం. అయితే ఒక అంశాన్ని  ఎంచుకున్నపుడు ఇక కనీసం ఓ గంట పాటు పూర్తిగా a అంశంపై మనస్సును లీనం చేయాలి. కేవలం పుస్తకాని చదువుకుంటూ వెళ్ళినంత మాత్రాన ఆ పుస్తకాని మనం పూర్తిగా అద్యయనంచేసినట్లు కాదు. పుస్తకాని వట్టిగె చదవడానికి, పూర్తిగా అద్యయనం చేయడానికి గల తేడా మనం గమనించాలి. కానీ, ఒక్క విషయం చదవడానికి మరియు అద్యయనం చేయడానికి ఏకాగ్రత కావాల్సిందే! పేజీలు తిరగేస్తూ వేలినంత మాత్రాన మనకు హ పుస్తకం సారాంశం తెలుస్తుంది కానీ పుస్తకాని క్షుణ్నంగ చదవడం వల మనసు అందులో లినమైపోతుంది దానివల్ల అంతరార్థం మనకు అర్థం అవుతుంది దాని సరంశాన్న్ని మన మనసు గ్రాహిస్తుంది దానివల్ల మనకు దనిఫైన మరింత పట్టువస్తుంది. మరింత చదవడానికి అది తోడ్పడుతుంది
4.            మనం ఒక అంశాన్ని ఎంచుకుని, చదుకోడానికి వచ్చాక పూర్తిగా ఒక గంట పాటు దానికి చదవాలి. అది చాల ముఖ్యం. సాదారణంగా మనం ఒక అంశాన్ని వెంటనే గ్రహించి, అర్థం  చేసుకోడానికి మనసు సిద్దంగా  ఉండదు, రోజు మనం చేసే రకరకాల పనులు కానీ, మిత్రులతోనూ, ఇతరులతో జరిపిన సంభాషణలు కానీ, ఇంకేదైనా కానీ మనమం చదుకోడానికి కుర్చునపుడు మనమ మనస్సులో తిరుగుతూ ఉంటయి, కాబట్టి, ప్రస్తుతం అద్యయనానికి కనీసం ఒక ఎనమిది నుండి పది నిమిషాలైన పడుతుంది, మనస్సును స్తిరం చేసిన తరువాత అంశం లోతులోకి వెళ్తుంటే ఉనట్లుంది అధయనం ఆపేస్తే, ఏకాగ్రత పోతుంది. చదువు దెబ్బ తిన్న్తుంది. కనుక మనస్సు ఏకాగ్రమైనక, మరింత లోతుకు వెలంది ఎటువండి అవన్చనియసంగటనలు ఎదురైనా నిరంతరంగా ఒక గంట పాటు చదువు కొనసాగించండి a సమయంలో మనస్సును అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించండి.
5.            ఇలా మనం చదువుకునే సమయం లో మాన్ కుటుంబ సభ్యులేవరైనా పిలిచే వేరే పని చెప్పి మన ఏకాగ్రత కి భంగం కల్గించే ఆస్కారం ఉంది కనుక మనం ముందుగానే వాలకి చప్పాలి, ఎందుకంటే వాలు పిలుస్తారేమో అనీ సందేహం మన మనస్సులో ఉంటె మనం మనస్సును పూర్తిగా  లగ్నం చేయలేం.
6.            ఇక చాడువుకునేటపుడు ఉండే ఇంకో సమస్య ధ్వని కాలుష్యం ఇ విషయంలో ఎవరు ఎం చేయలేరు కానీ ఇ ధ్వని కాలుష్యం నుండి తపింసుకునే మార్గం కూడా ఉంది అదేంటంటే చాడువుకున్ని ఉన్నతస్తానాలకు వేలలని మనం గట్టి సంకల్పం చేసుకోవడమే. ఎలాంటి అంశాలుమనసులో ఉంటే  బయట ప్రపంచంలో ఎం జరుగుతుందో మనకి ఎలాంటిద్వానులు వినిపించవు. ఉదాహరణకి మనం ఏదైనా మనస్తాపానికి లోనైనపుడు పక్కనవాలు ఎం చేస్తున మనకు అది వినిపించదు.
7.    చదువులో  ఏకాగ్రతా  సాదించడానికి మరో మార్గం కూడా ఉంది. అది ఏమిటంటే, చదువుతున్న విషయం పట్ల పూర్తి శ్రద్ధ చూపించడం! చాల మంది విద్యార్థుల మనస్సు ఒక విదమైన స్వప్నావ్యస్తలో ఉంటుంది. లేదంటే వాలకి నిర్ణిత లక్ష్యo లేకుండా విహరిస్తూ ఉంటారు. అందువల్లే వారు శ్రద్ధగ చదవలేరు.
 “మనస్సు ను ఏకాగ్రతాలో నిలపడం ఎలా?” అన్న ప్రశ్న ఉదయిoచవొచ్చు. దానికి ఉపయోగపడే కొన్ని సూచనలు ఎఇక్కడ చెప్తున్నా.
a.                  కొన్ని రకాలైన ఆహరం తింటే నిద్రమత్తు పెరుగుతుంది
b.                  శరీరంలో వివిధ అవయవాలను పరిశుబ్రంగా ఉంచితే, మనస్సు కూడా ఉస్తహంగా శక్తిమంతంగా ఉంటుంది. దానికి తోడు పక్క బట్టలు, ధరించే దుస్తులు కూడా పరిశుబ్రంగా ఉండాలి.
c.                   గదిలో మిగిలిన సామాగ్రి, రొజూ వాడుకునే వస్తువుల అన్నింటిని ఓ క్రమంలో ఉంచుకోవాలి. దినివల కూడా మనస్సు కి ఏకాగ్రతా ఉందని అర్థ అవుతుంది
d.                  విద్యార్తులు మరో విషయాన్నీ తెల్సుకోవాలి అది ఏమిటంటే-శరీరాన్ని, గది పరిసరాలను పరిశుబ్రంగా ఉన్చుకొవదమూ ఎంత ముఖ్యంమో, మనస్సును , మనస్సును పరిశుద్డం ఉంచుకోవడం అంతే ముఖ్యం, అనుచితమైన , అసభ్యమైన ఆలోచనలను మనస్సు లోపలకు  ప్రవేశింపనివ్వకూడదు. ఆ మాటకొస్తే, వాటిని మనస్సలో గందరగోళం రేపి, చెడగొట్టె నేరస్థులు అవే! మనస్సు మత్తుగా ఉన్నా స్వప్నావస్థలో ఏమంత పేద విషయం కాదు కానీ, అశ్లీలం,అసభ్యత గనుక మమస్సులకి ప్రవేశించయంటే, ఇక ఏకాగ్రత గురుంచి మాట్లాడడం కూడా వృధా .
e.                  ఓ గంట సమయంలో ఈ మేర అంశాలను పూర్తిగా కాహ్డివి తీరాలి అని విద్యార్తులు తమలో తాము దృడ సంకల్పం చేసుకోవాలి. ఆ నిర్ణిత సమయం లోపల అధయనం చేయడానికి తహతహ లాడాలి. మొదట్లో, కేటాయించుకున్న సమయం లో నిర్ణిత అంశాలను అధ్యాయనం చేయడం పుర్తికకపోవచ్చు. కానీ, ఆసక్తితో ప్రయత్నం చేయాలి.
8.    ఏకాగ్రత   పెంపోదించుకోవలనుకునేవారు కోరిక ఉన్న విద్యార్థులు పిచ్కాపాటి కబుర్లదకోకుండా, వాటిని దూరంగా. పిచ్కాపాటి కబుర్లాదుకోవదమనేది విషమంత ప్రమాదకరం. 
 

          స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం.
సరే! మనస్సును ఏకాగ్రపరచాలన్న మాట నిజమే? కానీ, దాన్నీ ఏ వస్తువు మీద ఏకాగ్రపరచాలి? మనం అందరం యోగులం అవడానికి ప్రయత్నిస్తున్నాం కావున, మనం అందరం స్వయం ప్రకాశితమైన మన ఆత్మజ్యోతి మీద మన మనస్సును ఏకాగ్రపరచాలి.
మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.
ఓం నమో పరమాత్మయే నమః




Post a Comment

0 Comments